39.2 C
Hyderabad
April 28, 2024 14: 44 PM
Slider హైదరాబాద్

మొక్కలు నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన కిషోర్ గౌడ్

#amberpet

నూతన సంవత్సరం ప్రారంభం రోజున రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు అంబర్ పేట లోని జీహెచ్ఎంసీ పార్క్ లో బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కిషోర్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటే మంచి కార్యక్రమం తో 2022వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి వాతావరణం కలిగి కరోనా లాంటి వైరస్ తొలిగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా విరజిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంతమంచి పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ గౌడ్, ధనంజయ, బంగారు శ్రీను, శ్యామ్, సాయి కుమార్, నరేష్, ప్రశాంత్, వినీత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

బ్యాంకు సిబ్బంది కుటుంబాలకు ఆర్ధిక సాయం

Satyam NEWS

తీజ్ ఉత్సవం: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

Satyam NEWS

జై తెలంగాణ: వందేళ్ల ప్రగతి ఆరేళ్లలోనే సాధించాం

Satyam NEWS

Leave a Comment