28.7 C
Hyderabad
April 27, 2024 05: 49 AM
Slider కర్నూలు

కర్నూలు జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

#Anjaneyaswamy

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున రోడ్డుపై ఉన్న విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆవేదనకు గురయ్యారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, హిందూ ధర్మ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ ఘటనకు బాధ్యులైన వారెవరో తెలుసుకోవడం కష్టంగా మారింది.

Related posts

థ‌ర్డ్ వేవ్ సంకేతాల నేప‌ధ్యంలో అలెర్ట్ అయిన కొత్త ఎస్పీ దీపికా పాఠిల్….!

Satyam NEWS

బ్యాంకులు పారిశ్రామిక రంగానికి అధిక రుణాలు అందించాలి

Satyam NEWS

భూ కబ్జా అడ్డుకున్న టీడీపీ నేతలపై వైసీపీ దాడి

Satyam NEWS

Leave a Comment