కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున రోడ్డుపై ఉన్న విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆవేదనకు గురయ్యారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, హిందూ ధర్మ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ ఘటనకు బాధ్యులైన వారెవరో తెలుసుకోవడం కష్టంగా మారింది.