28.7 C
Hyderabad
April 26, 2024 07: 06 AM
Slider విశాఖపట్నం

విశాఖ పోర్టు ట్రస్ట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం

#VizagPortTrust1

ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలకు నిలయంగా మారిన విశాఖపట్నంలో మరో ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యు 5 బెర్త్ లో కోస్టల్ షిప్పింగ్ బోట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి బిడి 51  నౌక నిన్న శనివారం రాత్రి విశాఖలో పోర్ట్ కు చేరుకుంది.

నౌకలలోకి సిబ్బందిని మార్చేందుకు ఈ కోస్టల్ షిప్ ను వినియోగిస్తారు. ఈ రోజు  మధ్యాహ్నం సమయంలో షిప్ క్యాబిన్ రూం నుంచి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది పోర్ట్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  రంగంలోకి దిగిన పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదాన్ని నివారించారు.

ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవలేదని పోర్ట్ యాజమాన్యం తెలిపింది. స్వల్ప ప్రమాదమేనని ఎటువంటి అస్తి నష్టం జరగలేదని పోర్ట్ ఉన్నతాధికారులు తెలిపారు.

Related posts

సోషల్ సర్వీస్: 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్ల పంపిణీ

Satyam NEWS

వితంతు పెన్షన్ పేరు మార్చాలి

Satyam NEWS

వెల్ కం: ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment