హైదరాబాద్ కు ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో జరుగుతున్న భూ వివాదాలు పోలీస్ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న వనస్థలిపురం ఏసీపీ జయరాం ని డిజిపి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదే వివాదంలో ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కూడా సస్పెండ్ అయ్యారు. జయరామ్, మురళీకృష్ణ కలిసి పలు వివాదాల్లో తలదూర్చినట్లుగా నిర్ణారణ అయినట్లు తెలిసింది. ఔటర్ భూములపై రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి.
పలువురు బాధితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేశారు. భూ వివాదాల ఫిర్యాదులపై ప్రత్యేక అధికారిని నియమించారు. ఏసీపీ , ఇన్స్పెక్టర్ల వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.