కరోనా సకండ్ కారణంగా జిల్లాలో పని చేస్తున్న ఉన్నతాధికారులు కూడా మంచాన పడుతున్నారు.ఇటీవలే ఆ వైరస్ బారిన పడి సీసీఎస్ డీఎస్పీ ఏకంగా అటు కుటుంబానికి ఇటు శాఖకు దూరమడంతో పోలీస్ శాఖే ఆశ్చర్యానికి గురి అయ్యింది. తాజా జిల్లాలోని చింతపల్లి మెరైన విభాగంలో పని చేస్తున్న ఎం.వి.రాజ్ కుమార్ కరోనా సోకడంతో నెల్లిమర్ల మిమ్స్ లో చికిత్స కై చేరారు.అయితే విధి ఎంత బలీయమైనదంటే..చికిత్స పొందుతున్న ఎంవీ.రాజ్ కుమార్ గత రాత్రి తన కుటుంబానికే దూరమయ్యారు. ఇద్దరు ఆడపిల్లలు కలిగిన రాజ్ కుమార్. మొన్నటి వరకు లా అండ్ ఆర్డర్ లో ఉంటూ ఇటీవలే చింతపల్లి లోఉన్న మెరైన్ విభాగానికి బదిలీ అయ్యాడు. జల్లా కేంద్రంలోని వీటీ అగ్రహారంలో ఉంటున్న రాజ్ కుమార్ అంత్యక్రయలు..అక్కడే నిర్వహించినట్టు సమాచారం. కరోనా మహమ్మారి శాఖా పరంగా మరో సిబ్బందిని తీసుకెళ్లారన్న వార్త తెలిసిన ఎస్పీ రాజకుమారి, ఆయన కుటుంబానికి తీవ్ర సాను భూతి తెలియ చేసారు.
previous post