కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని దేవాలయంలో మరొక అపచారం జరిగింది. మక్కపేట గ్రామం లోని పురాతన
కాశీ విశ్వేశ్వర దేవాలయం లో ఈ ఘోర అపచారం జరిగింది.
స్వామి వారి ముందు ఉండే నంది విగ్రహo చెవులను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇలాంటి సంఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ ప్రజలు ఏదో అరిష్టం జరగబోతున్నదని ఆందోళన చెందుతున్నారు.