ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 11న జరగనుంది. ముందుగా ఈ నెల 5న నిర్వహించాలని అనుకున్నా సచివాలయ ప్రాంగణంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్నందున కుదరలేదు. దాంతో 11న ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది.
సచివాలయంలోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు సంబంధించిన ప్రతిపాదిత అంశాలను పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం కోరింది.