మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా.ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసిన నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్గా అంతరిక్ష, అణుశాస్త్ర రంగాలలో దేశాన్ని బలమైనశక్తిగా నిలిపిన మహనీయుడు ఆయన అని అన్నారు. సామాన్యుడి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి నిరాడంబరంగా సాగిన ఆయన జీవితం యువతకు ఒక స్ఫూర్తిదాయకం అన్నారు.
ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. అబ్దుల్ కలాం జీవితం కోట్ల మందికి స్ఫూర్తిదాయకమని, విద్య, శాస్త్రరంగాల్లో కలాం సేవలు నిరుపమానం,ప్రేరణదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,మాజీ కౌన్సిలర్ కొర్నేపాటి సంజీవ్ రావు, మైనార్టీ నాయకులు మాబు, ఖలీల్, బాషా, చికిలి మస్తాన్, నాగోతు బాలస్వామి, చితిరాల బాలు,సుభాని,మల్లవరపు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.