ముస్లింలు ఒకరి ఎంగిలి ఒకరు పూసుకోవడం, అందరూ మీదమీద పడి ఉండటం, ఎంగిలి చెంచాలు నాక్కోవడం వల్లే కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నదని వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముస్లింలకు క్షమాపణ చెప్పారు.
ముస్లిం సోదరులంటే తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన అన్నారు. ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా తాను ఎక్కడ మాట్లాడలేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తనకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉందని, తన మాటలు బేషరతుగా వాపసు తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. తన మాటలు ముస్లింలను ఇబ్బందికి గురిచేస్తే క్షమించండి అని ఆయన అన్నారు. అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.