విజయనగరంలో ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం…రోడ్డు మీదకు వచ్చి ఉపాధ్యాయుల తరుపున పోరాటానికి దిగింది. కశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో అత్యాచారం,హత్యకు గురైన ఇద్దరు ఉపాధ్యాయుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విజయనగరంలో జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ వద్ద క్యాండిల్ తో నిరసన తెలియ చేసింది.
ఈ సందర్బంగా ఉపాధ్యాయులందరూ…పెద్దఎత్తున .ఉగ్రవాద చర్య…పిరికిపందచర్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.ఈ సందర్బంగా ఏపీయూఎస్ నేత రామునాయుడు మాట్లాడుతూ…అతి కిరాతకంగా…దారుణంగా కశ్మీర్ లో ఇద్దరు ఉపాధ్యాయులను ఉగ్రవాదులు హత మార్చరాని ఆవేదన వ్యక్తం చేసారు.
మరణించిన ఆ ఇద్దరు ఉపాధ్యాయుళ్లకు కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ఏపీయూఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కశ్మీర్ లో జిరిగిన హింసాత్మక సంఘటనపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.సదరు ఇద్దరు ఉపాధ్యాయుల హత్యోదంతంపై పెద్ద పెట్టున నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయని..ఈ నేపధ్యంలో ఏపీ ఉపాధ్యాయ సంఘం…కశ్మీర్ ఘటనను నిరసిస్తూ విజయనగరం లో కొవ్వొత్తుల నిరసన వ్యక్తం చేసామన్నారు.ఈ నిరసనలో ప్రముఖ ఉపాధ్యాయులు నాయుడు సంస్క్రతిక పాఠశాల టీచర్లు పాల్గొన్నారు.