38.2 C
Hyderabad
April 27, 2024 17: 40 PM
Slider జాతీయం

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అర్నబ్ గోస్వామి

#ArnabGoswamyArrest

తనకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన బొంబాయి హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు జస్టిస్ డి వై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ను రేపు విచారణకు స్వీకరించింది.

ఈ నెల 4వ తేదీ నుంచి అర్నబ్ గోస్వామి జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.

రిపబ్లిక్ టివి మరి రెండు సంస్థల నుంచి తనకు రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్లే తాను, తన తల్లి ఆత్మహత్య చేసుకుంటున్నామని లిఖితపూర్వకంగా చెప్పి ఆత్మహత్య చేసుకున్న అన్వేనాయక్ కేసుకు సంబంధించి అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసును పోలీసులు క్లోజ్ చేసినా అన్వేనాయక్ కుమార్తె ఫిర్యాదు మేరకు మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేసి అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసింది.  

Related posts

లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు

Sub Editor

కళలకు కాణాచి నగరంలో భోగీ ఉత్సవం…!

Satyam NEWS

మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టావా?: పాలవలస యశస్వి

Satyam NEWS

Leave a Comment