ఏపీ హైకోర్టు…సింహాచలం దేవస్థానం చైర్మన్ గా సంచయిత నియామకం చెల్లందంటూ తీర్పు ఇచ్చి..మళ్లీ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజునే కొనసాగించాలంటూ సంచలనమైన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో విజయనగరం జిల్లాకేంద్రంలో మూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారిని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
మహారాజ అలక్ నారాయణ సోసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ( మాన్సాస్) ఛైర్మన్, సింహాచలం దేవస్థాన అనువంశిక ధర్మకర్త హోదాకు అశోక్ గజపతిరాజే అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అశోక గజపతిరాజు కుటుంబ సభ్యులంతా పార్టీ నేతలతో పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
వేదపండితులు పూర్ణ కలశంతో అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం శేషవస్త్రం, ప్రసాదాలను పూజారులు అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ , మంత్రులకు మంచి జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
నిన్న మొన్నటి వరకు శాశ్వత నష్టం చేకూర్చినవారిలా కాకుండా మూగజీవాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఒక్క రోజు ముందే సింహాచలం దేవస్థానం ఆలయ చైర్మన్ గా సంచయిత నియామకం చెల్లదంటూ అశోక్ గజపతి రాజునే తిరిగి నియమించాలంటూ హైకోర్టు…జగన్ ప్రభత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి విదితమే.
ఈ నేపధ్యంలో మర్నాడు ఉదయం పది గంటలకు నగరంలోని పైడితల్లి అమ్మవారిని అశోక్ గజపతీ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఐవీపీ రాజు ,ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీష్,మాజీ ఎమ్మెల్యే భంజదేవ్,నగర నేతలు విజ్జపు ప్రసాద్,కనకల మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.