శ్రీశ్రీశ్రీపైడితల్లి అమ్మవారి తొలేళ్లఉత్సవం సందర్బంగా కేంద్ర మాజీ మంత్రి టీడీపీఅధినేత పీ.అశోక్ గజపతిరాజు..అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెనుక భాగాన మీడియాతో మాట్లాడారు. అదీ నర్మగర్బంగా కర్రవిరగక,పాము చావక అన్న చందంగా మీడియా వేసిన ప్రశ్నలకు తగ్గట్టుగానే అశోక్ గజపతి రాజు సమాదానం ఇచ్చారు.
టిక్కెట్ ధర 200 పెట్టడంపై అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ అమ్మ దర్శనం కలిగించే బాధ్యతప్రభుత్వానిదేనన్నారు. వీఐపీ దర్శనాలు ,ఉచిత దర్శనాలకు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు.
ఏ రాజకీయ పార్టీ టిక్కెట్ పెట్టకూడదని..అదే పెద్ద సమస్య అని అంటూ నన్ను మూడు పదవులను నుంచీ డిస్మిస్ చేసారంటూ పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అశోక్ గజపతి రాజు మాట్లాడారు. ప్రతీది రాజకీయంతో చూడరాదంటూనే..కోట గురించి…బురుజు వద్ద మొక్కల గురించి అశోక్ మాట్లాడారు.
ఈప్రభుత్వంఏం చేస్తోందని అసహనం వ్యక్తం చేసారు.టీడీపీ ఎవరి గొంతు కొయ్యలేదని…పిట్టకథలు మానుకుని వాస్తవాలు మాట్లాడాలన్నారు.విజయనగరంకుచెందిన మహాకవిగురజాడే చెప్పారని…వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టవోయ్ అంటూ అశోక్ గజపతిరాజు మాట్లాడి…మీడియాతో తన మాటలు ముగించారు.
అంతకు ముందు అందరినీ సమానంగా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు.ఇక అన్ని మతాలను గౌరవించాలని.. అలాగే అన్ని సంప్రదాయాలను కొనసాగించాలన్నారు. హిందూ మతం ఒక్కటే కాదు…ముస్లింలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలన్న కేంద్రమంత్రి..క్రిష్టియన్ పై ఒక్క మాట మాట్లాడక పోవడం విశేషం.