కడప జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏటీఎం లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అతని వద్ద నుంచి ఏటీఎం కేంద్రాలలో చోరీలకు ఉపయోగించే పరికరాలు కట్టర్, 15 బ్లేడ్స్, స్క్రూ డ్రైవర్, స్పానర్, సుత్తి తో పాటు 2,600 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈమేరకు రాయచోటి డీఎస్పీ శ్రీధర్ గురువారంనాడు మీడియా సమావేశంలో సమాచారం వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో రాయచోటి అర్బన్ సిఐ రాజు, ఎస్సై నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.