మానసిక వికలాంగురాలి పై అత్యాచారం జరిగిన సంఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో తుంగపాడు గ్రామంలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.
ఆ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు గేదెలు తోలుకొని పొలాలకు వెళ్ళింది. ఆ గ్రామానికి చెందిన ఆలూరి శేషగిరిరావు పొలము పనుల నిమిత్తం వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉన్న మానసిక వికలాంగురాల పై అత్యాచారం చేశారు.
అనంతరం ఇంటికి వెళ్లిన ఆ మహిళ నీరసంగా ఉండటం వలన అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమె కుటుంబసభ్యులు స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి విచారణ జరిపి నిందితుడైన శేషగిరిరావును అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినట్లు ఎస్ ఐ పి.హజరత్తయ్య తెలిపారు.
ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ పి.హజరత్తయ్య తెలిపారు.