నీటిపారుదల శాఖ కరీంనగర్ ఈఎన్సి గా నేడు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో బి. శంకర్ బాధ్యతలు చేపట్టారు.
నీటి పారుదల శాఖ కు చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు ఈ ఎన్ సి శంకర్ ను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలోని 6 గురు ఈఎన్సీలు, పలువురు సీఈలు బాధ్యతలు చేపట్టారని తెలిపారు.
రైతు సోదరులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా రైతు సోదరులకు సేవలు అందిస్తామని తెలిపారు.