వేతన సవరణ చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. రేపు, ఫిబ్రవరి 1న ఈ సమ్మె జరగనుంది. వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని, ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకరించ లేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు.
ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి, సేవలందిస్తున్నా, తమను పట్టించుకోకుండా, డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్ నాయకులు ఆరోపించారు. రెండు రోజుల సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుంటే, మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.