కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల మంత్రి కిషన్ రెడ్డి అధ్వర్యంలో అక్టోబరు 2 వ తేదీన అంబర్ పేట లోని మున్సిపల్ గ్రౌండ్ లో జరిగే బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ గ్రౌండ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు మాట్లాడుతూ అక్టోబరు 3 వ తేదీన అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో జరిగే బతుకమ్మ వేడుకలలో పాల్గోని జయప్రదం చేయ్యాలని అన్నారు. తెలంగాణ చరిత్రకు చిహ్నం ఈ బతుకమ్మ ఉత్సవాలు అని, అంబర్ పేటలోని మహిళలంతా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట కార్పొరేటర్ అమృత, జిల్లా అధికార ప్రతినిధి అజయ్ కుమార్, నందు కుమార్, రమేష్ యాదవ్, యష్వంత్, సంతోష్ కుమార్, నాగభూషణ్ చారి, ముఖేష్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట