ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులకు అతిపెద్ద పండగ బతుకమ్మ పండుగ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 98 వేల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
చేప పిల్లల విడుదల
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామ ఊర చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణి చేస్తున్న చేప పిల్లలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీకృత మత్స్య అభివృద్ది పథకం ద్వారా లింగాపూర్ గ్రామ చెరువులో సుమారు 39,000 చేప పిల్లలను విడుదల చేసినట్టు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 93 లక్షల రూపాయలతో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు.