అంబర్పేట్ నియోజకవర్గం అంబర్పేట్ డివిజన్ చెన్నారెడ్డి నగర్ నివాసి టి.నరసింహ చారికి గుండె మరియు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆపరేషన్ చేయించుకున్న వాటికి సంబంధించి హాస్పిటల్ ఖర్చులను భరించలేక ఆ విషయాన్ని దూసరి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయాన్ని ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఈ విషయాన్ని విన్నవించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం ఇప్పించాలని కోరారు. వారు సి.యం.ఆర్.ఎఫ్ దరఖాస్తు చేయించడంతో వారికి 3,00,000 రూపాయలు మంజూరయ్యాయి దాంతో చెక్కును వారికి అందచేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి, మంత్రి తన్నీరు హరీష్ రావుకి, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్