దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో టీమిండియా పర్యటనపైనా ఈ కొత్త వేరియంట్ ప్రభావం పడనుంది. దీంతో ఈ సిరీస్ జరడగంపై సందిగ్ధం నెలకొంది.
దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానాలో 50 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్కు సంబంధించి భారతదేశంలో ఎటువంటి కేసు వెలుగుచూడలేదు. వీటన్నింటి మధ్య వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనపై బీసీసీఐ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్, ప్రాల్, కేప్ టౌన్, సెంచూరియన్లలో మొత్తం 10 మ్యాచ్లు జరగాల్సి ఉంది. 3 టెస్ట్ మ్యాచ్లు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది.