ములుగు పోలీస్ స్టేషన్లో అత్యుత్తమ విధులు నిర్వహించిన ములుగు ఎస్సై బండారు రాజు కు 2020 సంవత్సరం బెస్ట్ ఫంక్షనల్ వర్టికల్ ఆఫీసర్ గా గుర్తింపు లభించింది.
డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రాన్ని మంగళవారం రాత్రి అందుకున్నారు.
ఉమ్మడి పది జిల్లాల్లో విధులను సక్రమంగా నిర్వహించిన ఎస్సై లను గుర్తించే క్రమంలో ఈ ఎంపిక జరిగింది.
ములుగు మండలం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందస్తు జాగ్రత్తలతో మేడారం జాతర విజయవంతంగా నిర్వహించేలా కృషి చేసినందుకు కు ఆయనకు ఈ గుర్తింపు లభించింది.
అధిక వర్షాలతో ములుగు మండలం అతలాకుతలమైన సందర్భంగా ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా తనవంతుగా విధులు నిర్వహించిన ఎస్సై బండారు రాజు ను పోలీసు శాఖ తరపున మంచి గుర్తింపు లభించినందుకు ములుగు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.