కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయరాదని ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలను భగ్నం చేస్తూ, బిజెపి ఆంధ్రప్రదేశ్ చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ఇది ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయం అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో నివసించే ఎవరైనా, భారత రాజ్యాంగాన్ని పాటించాలి, కాదని రాచమల్లు రాజ్యాంగం, పాటిస్తామంటే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయని ఆయన అన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి ఇప్పటికే ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే మీద నిర్వాహకుల మీద తక్షణం పోలీసులు కేసు నమోదు చేయాలని ఏపి బీజేపీ డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు