40.2 C
Hyderabad
April 29, 2024 16: 57 PM
Slider కడప

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఫైర్

#BJP

ప్రభుత్వానికి వంత పాడుతున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కి 20 ఏళ్లలో ఉన్న క్లీన్ ఇమేజ్ తుడిచి పెట్టుకొని పోయిందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు. కడప జిల్లా రాజంపేట లో ని ఆర్ అండ్ బి బంగాళా లో శనివారం నాడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ పై తీరును ప్రశ్నించారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలో విగ్రహాల ద్వంసం పై మొదట రాజకీయ ప్రమేయం లేదన్నారని అన్నారు. మరుసటి రోజు మాట మార్చి పక్షులు,తేనె తుట్టెలు జంతువులు ఎలుకలు పై నెపం నెట్టారు అన్నారు.

మళ్ళీ మాట మార్చి ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఉందని అందులో బీజేపీ వారు ఉన్నారనడం పోలీసు శాఖ పై ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్ము చేయడమే అని విమర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించు కోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అని అన్నారు.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ తానే ఈ ఆలయాల ద్వంసం చేశానని మొదట చెప్పినా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల లో విమర్శలు వెల్లువెత్తిన తరువాత ప్రవీణ్ ను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రవీణ్ కు వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలు బయట పడిన తరువాత డిజిపి దాన్ని డెవర్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.

 హోమినిస్టర్ ఉత్సవ విగ్రహంలా మిగిలి పోయిందన్నారు. పోలీస్ శాఖ సంఘం నేతలు వైసీపీ అధికార ప్రతినిదులకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం ను ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దాన్ని ఖండిస్తూ సంఘం నేతలు సమావేశం పెట్టడం హాస్య స్పదమన్నారు

పోలీస్ శాఖ సంఘం కి చిత్త శుద్ధి ఉంటే రాష్ట్రంలో ఎస్పీ ,ఎస్సై ,సి.ఐ లకు 20 నెలల నుంచి డ్యూటీ లు వేయకుండా వేధిస్తున్నారు దాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఎన్జీవో సంఘాలు కూడా వారి సమస్యలను గురించి కాకుండా ప్రభుత్వం ను వెనుకేసు కొస్తున్నారన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లిన్ ఇమేజ్ 20 నెలల్లో తుడిచిపెట్టుకొని పోయిందని తీరుమారాలని సూచించారు.

Related posts

విద్యా వాలంటీర్లను సర్వీసులో కొనసాగించాలి

Satyam NEWS

ప్రతి బస్తీలో పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

జర్మనీలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి

Satyam NEWS

Leave a Comment