పల్లెప్రగతి కార్యక్రమం లో పాల్గొని ప్రజల సమస్యల పై సంబంధిత అధికారుల తో ప్రజాసమస్యలపై ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి KCR ప్రతిష్టత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం అందరo మన ఇల్లు ఎలాగైతో శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరు మన వాడ కూడా అలానే శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. ఈ రోజు ఇంచర్ల గ్రామం లో వాడ వాడ తిరిగి డ్రానేజీ సమస్యలు వాలిన కరెంట్ తీగలు వంగి ఉన్న కరెంట్ స్తంబాలు గ్రామం లో రోడ్లు పరిశీలించారు. గ్రామస్తులను వారు సమస్యలు అడిగి మరి తెల్సుకున్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి చేపిస్తాను అని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ పూజారి రమాదేవి శ్రీనివాస్ సర్పంచ్ మోరే రాజయ్య pacs చేర్మెన్ చిక్కుల రాములు ఉప సర్పంచ్ కుమార్ MDO శ్రీనివాస్ MPO హన్మంత సేట్రెటరీ రాజు TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.