35.2 C
Hyderabad
April 27, 2024 13: 01 PM
Slider వరంగల్

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంచిన బీజేపి నేత

Kottapally Satish

జనగామ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన విలేఖరులకు, అభాగ్యులకు, వలస కూలీలకు సుమారు 10 లక్షల రూపాయల విలువ గల నిత్యావసరాలను జనగామ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్ధి బీజేపీ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి సతీష్ కుమార్ పంపిణీ చేశారు.

ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, నిత్యావసర (కిరాణా) వస్తువులను ఆయన పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కబళిస్తున్న ప్రస్తుత తరుణంలో సమర్థవంతంగా విధులను నిర్వహిస్తున్నవారికి ఇది తన సాయమని అన్నారు.

సామాజిక బాధ్యతను పాటిస్తూ, సమాచార సేకరణలో అలుపెరుగని జర్నలిస్టులు నిత్యవసర వస్తువుల కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో  వారి కష్టాలను అర్థం చేసుకుని ఈ వితరణ చేస్తున్నట్లు చెప్పారు.

 జనగామ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల రిపోర్టర్ లకు చేయుతగా ఈ సహాయాన్ని అందిచానన్నారు. నెలకు సరిపడే విధంగా ఒక్కొక్క జర్నలిస్టికి 25 కేజీ ల బియ్యం,కిరాణా సరుకులు ( నిత్యావసర వస్తువులు)ఇచ్చారు.

 అదేవిధంగా సాధారణ రోజుల్లో పాత్రికేయుల పట్ల ఎంతో ఆప్యాయత, ప్రేమలను వలక బోసే  ప్రజా ప్రతినిధులు, నేతలు , ఎందరో ఉన్నా ప్రస్తుత సమయంలో కనీసం పలకరించపోవడం జర్నలిస్టులు అందరికీ అనుభవమేనని, ఇంత పెద్ద సహాయం చేయడమే కాక ఆపద సమయంలో విలేకరులను గుర్తించినందుకు జర్నలిస్టులందరు కొత్తపల్లి సతీష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.

Related posts

వినుకొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

ఆషాఢమాసం బోనాలు

Satyam NEWS

జ్యోతిరావు ఫులే ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం

Bhavani

Leave a Comment