గడచిన ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని ఆ ఘనత సీఎం జగన్ కే వర్తిస్తుందని బీజేపీ నేత పాకలపాటి సన్యాసి రాజు ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో 2024లో గాని ప్రస్తుతం ఈ నెల 13 న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో నిల్చున్న బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థి గా నిలుచున్న మాధవ్ ను మరో సారి గెలిపించాలని పాకలపాటి మురళి కోరారు. ఈ మేరకు విజయనగరం లో ఏబీవీపీ, బీజేవైం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీ మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం చేసిన అప్పును తిరిగి తీర్చే సత్త…దమ్ము ఒక్క బీజేపీ కే ఉందన్నారు.2024లో బీజేపీ ని మళ్ళీ కేంద్రంలో కూర్చొ బెట్టాలని..అందుకు ప్రస్తుతం జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికల ను ఉపయోగించుకోవాలని మురళీ అన్నారు. అందుకు బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థి మాధవ్ ను మళ్ళీ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ అభ్యర్థి గా నిల్చున్న విషయం తెలుసు నని…13 న జరగబోయే ఎన్నికల లో అతనికే ఓటేసి బీజేపీ ని గెలిపించాలని మురళీ కోరారు.
previous post
next post