PRC, DA, IR లను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను గత ఆరు సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నందుకు నిరసనగా రేపు భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొమరం భీమ్ జిల్లా సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ప్రభుత్వం తన ఉద్యోగులను తానే మోసం చేస్తున్నదని దీన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు నిరసన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర బీజేపీ ఆదేశించిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి తమ నిరసన ప్రభుత్వానికి వెల్లడిస్తామని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఉద్యోగులకు తక్షణమే PRC, DA, IR లను ఇంప్లిమెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వం ఉద్యోగులకు మద్దతు గా నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ సిర్పూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.