హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని రామాలయం బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. బుదవారం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సందు రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
హుజురాబాద్ లో జరుగుతున్న ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలుపొంది కుటుంబ నియంత కెసిఆర్ పాలన అంతానికి ఆరంభం కావాలని కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని రామాలయంలో శ్రీరామచంద్రమూర్తి కి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరగదిండ్ల పరమేష్, కర్తాల్ కృష్ణ, తప్పెట జగదీష్, కాశీపురం మహేష్ కొల్లాపూర్ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శి యండి. ఇమ్రాన్ ఖాన్,ఎల్లయ్య యాదవ్, పిన్నం శెట్టి శివ, శ్రీ రామ్, బజరంగ్దళ్ పురంధర్, మెంటే శివ కృష్ణ యాదవ్ పులి భరత్ ఏబీవీపీ భాను, మండల అధ్యక్షులు సాయి కృష్ణ గౌడ్, సాయి ప్రకాష్ యాదవ్, రమేష్ ముదిరాజ్, అమరగిరి భరత్ యాదవ్ పాల్గొన్నారు.