ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రయత్నిస్తున్నదని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పేర్ని నాని ఈ షాకింగ్ కామెంట్ చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలదోయాలా అని చూస్తున్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిపై ఒక విలేకరి వేసిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అప్పుటు చేయని వాడు ఎవడు అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.
కేంద్రం విచ్చలవిడిగా అప్పులు తీసుకువస్తున్నదని ఆయన అన్నారు. కేంద్రం అప్పులు తీసుకువస్తూ మేం అప్పులు తెచ్చామని చెప్పడం ఏమిటని వారన్నారు. ఈ గురివింద గింజలు మాకు చెప్పేదేమిటని మంత్ర తీవ్రంగా ఆక్షేపించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసి కాషాయం కండువాను కప్పుకున్నవాడ్ని సీట్లో కూర్చో బెట్టాలని చూస్తున్నదని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపిలో బాబాల పాలన తీసుకురావాలని బిజెపి చూస్తున్నదని మంత్రి పేర్ని నాని అన్నారు.