26.7 C
Hyderabad
April 27, 2024 07: 34 AM
Slider ముఖ్యంశాలు

పోతిరెడ్డిపాడుపై పోరాటంలో బిజెపి విజయం

#Bandi Sainjai

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఏకపక్షంగా జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరడం బిజెపి తెలంగాణ విజయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203 పైన తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌కు తాము లేఖ రాశామని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి తక్షణమే స్పందించి త్వరలోనే అఫెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీని ఆదేశించారని బండి సంజయ్ వెల్లడించారు. ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడు నీటి సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతోందన్నారు. దీన్ని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని బండి సంజయ్ తెలిపారు.  

Related posts

ఉప్పల్‌లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ: నేర్ధం భాస్కర్‌గౌడ్‌

Satyam NEWS

డబ్బు అన్ని చెడులకు మూలo

Murali Krishna

సోమశిల పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో మద్యం విక్రయాలు

Satyam NEWS

Leave a Comment