నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సోమశిల పుణ్యక్షేత్రం టూరిజానికి వెళ్లే దారిలో (వరిదేల చెరువు కట్ట కింద) అక్రమంగా డబ్బులు పెట్టి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఇదే విషయాన్ని కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రఘు ప్రోలు విజయలక్ష్మికి బుధవారం బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి యండి.ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే కొల్లాపూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కొందరు ఏలాంటి అనుమతులు లేకుండా డబ్బాలు వేసుకొని తాగుబోతులకు అడ్డగా మారుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాగిన మద్యం సీసాలు రైతుల పంట పొలాల్లో పారేస్తున్నారు.
వాటి వల్ల రైతులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఫిర్యాదు ద్వారా తెలిపారు. అక్కడి నుండి వెళ్ళే పాదచారులకు సమస్యలు కలుగుతాయి అని తెలిపారు. అంతేకాకుండా సోమశిల టూరిజం పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో మద్యం విక్రయాలు మంచిది కాదని తెలిపారు.
ఇలాంటి వారిని ఉపయోగించవద్దని తక్షణమే అక్కడి నుండి డబ్బాలను తొలగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కొల్లాపూర్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, రాధా కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్.నెట్, కొల్లాపూర్