37.2 C
Hyderabad
April 26, 2024 19: 09 PM
Slider నల్గొండ

రక్తదానం తో ప్రాణాలు నిలబెట్టిన DSR ట్రస్ట్

#BloodDonation

దగ్గుపాటి సుశీల రాజారత్నం (డి.ఎస్.ఆర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేసి మరో ప్రాణం నిలబెట్టారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో ఈ కార్యక్రమం జరిగింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన వెంకటమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీ వైద్యశాలలో చేరగా డాక్టర్  రక్తం తక్కువ ఉందని చెప్పారు.

దాంతో రోగి బంధువులు హుజూర్ నగర్ తిలక్ నగర్ లోని డి.ఎస్.ఆర్ ట్రస్ట్  చైర్మన్  దగ్గుపాటి బాబురావు కు ఫోను చేసి విషయం చెప్పారు.

వెంటనే స్పందించిన చైర్మన్ మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ట్రస్ట్ సభ్యుడు కందుల రాంబాబు, కోల్లపూడి రాము, దగ్గుపాటి సురేష్ ని  హైదరాబాద్ పంపారు.

వారు ఇక్కడకు వచ్చి బ్లడ్ ఇచ్చి రోగిని ప్రాణాపాయం నుండి కాపాడారు.

ఈ సందర్భంగా చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే మానవ జన్మకు సార్ధకం చేకూరుస్తుందని అన్నారు.

సకాలంలో రక్తదానం చేసిన ట్రస్ట్ సభ్యుడు కందుల రాంబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

వనపర్తిలో భూకబ్జా పై బి.సి కమిషన్ సభ్యుడు ఆచారికి ఫిర్యాదు

Satyam NEWS

విధి నిర్వహణలో మానవీయకోణం తో పనిచేయాలి

Satyam NEWS

చౌకబియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ కు తరలింపు

Satyam NEWS

Leave a Comment