సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన చిలక సైదమ్మ భర్త మైసయ్యకు రక్తదానం చేసి డి ఎస్ ఆర్ ట్రస్టు ఆదుకున్నది.
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న హాస్పటల్లో చేర్పించగా డాక్టర్ బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. దాంతో సైదమ్మ కుటుంబ సభ్యులు డి.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించి పట్టణానికి చెందిన కస్తాల దిల్ కుమార్ ద్వారా A పాజిటివ్ బ్లడ్ ఇప్పించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ ట్రస్ట్ తరపున రక్త దాత దిల్ కుమార్ కి ప్రత్యేక ధన్య ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికి కస్తాల దిల్ కుమార్ 12 మార్లు రక్త దానం చేశారని, దిల్ కుమార్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి, ప్రాణ దాతలుగా నిలవాలని, తమతో పాటు ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో బాగస్వాములు కావాలని కోరారు.
సకాలంలో రక్తదానం చేసినందుకు సైదమ్మ కుటుంబ సభ్యులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్లా సైదులు,దగడ గోపి, K.బాబు వినోద్ తదితరులు పాల్గొన్నారు.