సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన గోపి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ హైదరాబాద్ పంజాగుట్ట లోని ప్రైవేట్ వైద్యశాలలో చేరగా డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు.
రక్తం వెంటనే ఎక్కించాలని చెప్పగా పేషెంట్ గోపి కి చెందిన వారు DSR ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాబురావు వెంటనే స్పందించి ట్రస్ట్ వైస్ చైర్మన్ దగ్గుపాటి సురేష్ ను హైదరాబాద్ పంపి సకాలంలో పేషెంట్ కు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు.
ఈ సందర్భంగా DSR ట్రస్టు చైర్మన్ బాబూరావు మాట్లాడుతూ సురేష్ ఇప్పటి వరకు 14 మార్లు బి పాజిటివ్ బ్లడ్ ఇవ్వడం జరిగిందని,రక్త దానం చేసిన సురేష్ ను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని అన్నారు.