32.7 C
Hyderabad
April 27, 2024 02: 21 AM
Slider ప్రపంచం

లిబియాలో స్కూల్ పై దాడి: 30 మంది పిల్లల మృతి

Libia

లిబియా దేశం ట్రిపోలిలోని ఓ ఆర్మీ స్కూల్‌పై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది విద్యార్థులు మృతి చెందగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అమీన్ అల్ హషేమీ తెలిపారు. దక్షిణా ట్రిపోలిలోని అల్ హబ్దా అల్ ఖద్రా ప్రాంతంలో జరిగింది.

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ ఎకార్డ్ (జిఎన్ఏ) ఆధ్వర్యంలో ఉన్న ట్రిపోలి లో ఆ దేశ మిలిటరీ కమాండర్ ఖలీఫా హఫ్తార్ ఆధ్వర్యంలోని లబియా నేషనల్ ఆర్మీ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే లిబియా నేషనల్ ఆర్మీ తమ జోక్యం లేదని ప్రకటించింది.  

ఈ ఘటనపై లిబియ్ ప్రెసిడెన్సియల్ కౌన్సిల్ దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించింది.

Related posts

ఓట్లు వేయించుకున్న వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు… మేం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం

Satyam NEWS

ఎస్పీ ఆదేశాలిచ్చారు… సిబ్బంది పాటించారు…!

Bhavani

ములుగులో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు

Satyam NEWS

Leave a Comment