అదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాణస్నేహితుడు ఉపాధ్యాయుడు ప్రకాష్ గౌడ్ మరణించారు. ఎన్నో ఏళ్లు వీరిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో కలిసి ఉన్నారు.
తన ప్రాణ స్నేహితుడు చనిపోవడం పట్ల ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేడు జరిగిన ఆయన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు.
ఆయన వెంట ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కూడా ఉన్నారు.