విజయనగరం లో సర్ విజ్జీ స్డేడీయంలో జిల్లా బ్రాహ్మణ క్రికెట్ పోటీలను వైఎస్సార్సీపీ జిల్లానేత మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బోత్స లక్ష్మణరావు ప్రారంభించారు.
తొలుత స్టేడియంలో గాయత్రీ దేవీ ఫోటోకు పూలదండవేసి…జ్యోతి వెలిగించి…అనంతరం రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కొద్ది సేపు బ్రాహ్మణ యువతతో కలిసి బ్యాటింగ్ చేసారు.
అలాగే బౌలింగ్ చేసారు. అనంతపురం మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ శర్మ ,సత్య ప్రసాద్ ,పేరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా బ్రాహ్మణ క్రీడా సంఘం కార్యదర్శి ఇనుగంటి రాకేష్ శర్మ ముందుగా అతిధులకు స్వాగతం పలికారు. బ్రాహ్మణ యువతను ఏకీకృతం చేయడమే ఈ క్రీడా పోటీలు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.