రామ మందిర నిర్మాణానికి మాజీ పార్లమెంటు సభ్యుడు, బిజెపి నాయకుడు గోకరాజు గంగరాజు కోటి రూపాయలు విరాళం అందించారు.
శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే శ్రీరామ భవ్య మందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమం విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేడు జరిగింది.
విజయవాడ లోని విజయకీలాద్రి దేవస్థానం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామీ పాల్గొన్నారు.
నిధి సమర్పణ కూపన్ల పుస్తకాలను చిన జీయర్ స్వామీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో RSS ప్రాంత ప్రచారక్ శ్రీరాం భరత్ కుమార్ జీ, విభాగ్ సంఘచాలక్ కోనేరు దుర్గాప్రసాదుజీ ,
శ్రీనివాసరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త తోండేపు హనుమంతరావు, VHP విజయవాడ మహానగర్ అధ్యక్షులు సాన శ్రీనివాస్ జీ , నాగలింగ శివాజీ తదితరులు పాల్గొన్నారు.