సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం బూరుగడ్డ గ్రామంలో కొలువై ,భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న అతి పురాతనమైన శ్రీ ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానానికి అదే గ్రామానికి చెందిన దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులు D.L నర్సింహారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, సతీమణి రాధిక వారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం 1,30,000 వేల రూపాయల విలువ గల రధాన్ని ఆలయ ఈఓ లక్ష్మణ్ రావు, అర్చకుల సమక్షంలో బహుకరించారు.
ఆలయ సంప్రదాయాల ప్రకారం అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ దంపతులను అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి వారు ఏకశిలపై పవళించి ఉండి భక్తులకు కనువిందు చేయటం విశేషం. ఈ కార్యక్రమంలో దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులు, బంధువులు,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.