అనారోగ్యంతో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలుస్తుందని టి.అర్.యస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గోల్నాక డివిజన్ నివాసి నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్ కుమార్ కి వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ ఖర్చులు భరించలేని ఆ కుంటుంబ కష్టాలను గమనించిన శ్రీనివాస్ గౌడ్ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సాయం చేయాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను కోరారు. ఈ మేరకు సి.యం. ఆర్. ఎఫ్ కు దరఖాస్తు చేయించడం జరిగింది. మంత్రి హరీష్ రావు చొరవతో వారికి రూ: 50,500/- మంజూరు చేయడం జరిగింది. బుధవారం రూ: 50,500/- చెక్కును వారి కుటుంబం సభ్యులకు దూసరి శ్రీనివాస్ గౌడ్ అందచేశారు.
సత్యం న్యూస్, అంబర్పేట్