38.2 C
Hyderabad
April 28, 2024 22: 47 PM
Slider గుంటూరు

నరసరావుపేటలో పెద్దఎత్తు కాగడాల ప్రదర్శన

chadalavada

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు భారీ కాగడా ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్తంభం సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకూ ఈ కాగడా ర్యాలీ సాగింది.

తెలుగుదేశం పార్టీ నరసరావు పేట నియోజకవర్గం ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు నాయకత్వంలో సాగిన ఈ కాగడా ర్యాలీలో కొల్లి బాబయ్య, వాసిరెడ్డి రవి, పులిమె రామిరెడ్డి, కడియాల రమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.

ప్రజా రాజధానిగా ప్రారంభమైన అమరావతిని కాదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వేరే నిర్ణయం తీసుకోవడం క్షమించరానిదాని అరవింద బాబు అన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆయన కోరారు.

Related posts

పోలీసు అధికారిపై చర్యలకు లోక్ సభ స్పీకర్ హామీ

Satyam NEWS

ఇది మంత్రుల కార్యక్రమమా? టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా?

Satyam NEWS

విద్యా, వైద్యం,ఉపాధి, రంగాల్లో యువత రాణించాలి

Satyam NEWS

Leave a Comment