28.7 C
Hyderabad
April 27, 2024 03: 23 AM
Slider కృష్ణ

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబు బదిలీ

#KanakadurgaTemple

విజయవాడ లోని దుర్గగుడిలో ఇంతకాలం జరిగిన అవినీతి వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో సురేశ్​బాబుపై వేటు వేసింది.

ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను దుర్గగుడి ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సురేశ్‌బాబు దేవాదాయ శాఖ ఆర్‌జేసీగా బదిలీ అయ్యారు. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు దుర్గగుడిలో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించాయి.

ఈవో సురేశ్‌బాబు ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని అవినీతి నిరోధక శాఖ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబును బదిలీ చేసింది.

Related posts

షిరిడి సాయి బాబా మందిరంలో రధసప్తమి వేడుకలు

Satyam NEWS

Shocking News: పాలమూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజీనామా

Satyam NEWS

న్యాయం చెయ్యాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment