38.2 C
Hyderabad
April 29, 2024 22: 44 PM
Slider ప్రత్యేకం

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

#TDP

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా రేపు పెన్షన్ లు అందేలా చూడాలని కోరుతూ టీడీపీ అధినేత లేఖ రాశారు. లేఖలో అంశాలు:

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి   

వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి

వృద్ధలు, వింతంతువులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలి.

గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలి.

దీని కోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అనుమతించాలి…దీనికి అసవరం అయిన అనుమతులు ఇవ్వాలి.

గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5 తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని కోరుతున్నా.

పెన్షన్ ల పంపిణీకి అవసరం అయిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు అనే వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా పెన్షన్ల పంపిణీకి అవసరం అయిన నిధులు వెంటనే అందుబాటులో ఉంచండి అని చంద్రబాబు తన లేఖలో కోరారు. చీఫ్ సెక్రటరీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరారు.

Related posts

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి

Bhavani

బ్యాంకుల సమ్మె వాయిదా

Satyam NEWS

Leave a Comment