సీసీ కెమెరాలను అమర్చి, నిరంతర నిఘా పెట్టడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని, భద్రత దృష్ట్యా ప్రజలకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. నల్లకుంట డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావున ప్రతీ వీధిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు నల్లకుంట కాలనీ వాసులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే కాలనీ వాసులతో మాట్లాడి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట