33.7 C
Hyderabad
April 30, 2024 00: 59 AM
Slider విజయనగరం

స‌త్యం వారి ఆచ‌ర‌ణ‌, శాంతి వారి సందేశం,ప్రేమ వారి స్వ‌రూపం….!

#babamet

ఇదే హ‌జ‌ర‌త్ బాబా ఖాద‌ర్ వ‌లియా వారి ల‌క్ష్యం…!

ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రంలో బాబామెట్ట‌..అది చ‌రిత్ర పుట‌ల‌లో నిల‌చిపోయే ప్ర‌దేశం… ఆధ్యాత్మిక ప్ర‌పంచానికి పునాది వేసిన విజ‌య‌న‌గ‌రం హ‌జ‌ర‌త్ బాబా ఖాద‌ర్ అవ‌లియా  ఆ మెట్ట‌లోనే ఉండేవారు.అందుకే అప్ప‌టి నుంచీ ఆ మెట్ట‌కు బాబామెట్ట అని పేరువ‌చ్చింద‌ని స్థ‌ల పురాణం.సీన్ క‌ట్ చేస్తే…విజ‌య‌న‌గ‌రం హ‌జ‌ర‌త్ బాబా ఖాద‌ర్ అవ‌లియా   వారి 63 సూఫీ సుగంధ మ‌హోత్స‌వం మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నుంద‌ని వారి ఆశ్ర‌మ నిర్వ‌హాకులు తెలిపారు.

13 వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు బాబామెట్ట ఖాద‌ర్ వ‌లీ ఆశ్ర‌మంలో ఉర్సు ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌న్నారు. స‌త్యం శాంతి, ప్రేమల ద్వారా…ఆచ‌ర‌ణ‌,సందేశం, స్వ‌రూపం ఇలా మూడు ల‌క్ష్యాల‌తో..బాబా భ‌క్తుల‌ను  గ‌డ‌చిన కొన్నేళ్లుగా ఆశీర్వ‌దిస్తున్నార‌ని తెలిపారు.

ఈ మేర‌కు 13వ తేదీన బాబామెట్ట బాబా ఆశ్ర‌మంలో ఏటీకే సంస్థ ఆధ్వ‌ర్యంలో  సూఫీ సుగంధ మ‌హోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. ఉదయం…స్తుతి చేయ‌డం జ‌రుగుతుందని…మ‌ర్నాడు…14 వ తేదీన‌  బాబా వారి చిత్ర‌ప‌ఠాన్ని ప్ర‌త్యేక వాహ‌నంలో న‌గ‌రం మొత్తం ఊరిగేంచ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ నెల 15న చివ‌రి రోజున  ఉరుసు స‌మాప్తి కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని…ఈ మూడు రోజులు ప్ర‌తీ రోజు వేల‌మందికి అన్న‌దానం జ‌రుగుతుంద‌న్నారు.

ద‌ర్బార్ లో అన్నార్తుల‌కు ఆశ్ర‌యం క‌ల్పిచ‌డంతోపాటు లక్ష‌లాది మందిభ‌క్తుల‌కు అన్న‌దానం కార్య‌క్ర‌మం  నిర్విరామంగా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. క‌రోనా మూలంగా గ‌డ‌చిన రెండేళ్ల నుంచీ సూఫీ సుగంధ ఉర్సు ఉత్స‌వాలు…అంత ప‌ద్ద‌గా నిర్వ‌హించ‌లేద‌ని…క‌రోనా పూర్తిగా రూపు మాప‌డంతో  ఈ ఏడాది 63 వ సూఫీ సుగుంధ  మ‌హోత్స‌వాలు…బాబామెట్ట‌లోని   ఖాద‌ర్ వ‌లీ ఆశ్ర‌మంలో నిర్వ‌హిస్తున్న‌ట్టు  తెలిపారు. ఈ మేర‌కు ఏటీకే సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈ ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

Related posts

విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయింది

Satyam NEWS

జూలై 4 నుంచి ఈఏపి సెట్

Sub Editor 2

ప్రజాస్వామ్య పద్దతిలో కార్యకర్తల అభిప్రాయం మేరకే రేవంత్ కు పదవి

Satyam NEWS

Leave a Comment