కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భార్య అనుపమ నాదెళ్ల ముందుకు వచ్చారు.
ఆమె తరపున 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దీన్ని వాడాల్సి ఉంది. ఈ చెక్కును ఆయన తండ్రి మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు.