ఈ సారి మన నేత చంద్రబాబు గెలవకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత లు గాడితప్పడమే కాక…మన భార్య ,మనకు కాకుండా పోతుందని… టీడీపీ సీనియర్ నేత ,పాలిట్ బ్యూరో సభ్యులు ,కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు చేసారు.పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లా విజయనగరం పార్టీ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ మాట్లాడుతూ… నియోజకవర్గంలో టీడీపీ ని గెలిపించుకోవలసన పరిస్థితి మనందరిపైన ఉందన్నారు. ఈ సారి గనుక మన అధినేత చంద్రబాబు ను గెలిపించుకోలేకపోతే….నా భార్య నాకు కాకుండా పోతుందని వ్యాఖ్యానించారు. సో…టీడీపీ ని తప్పనిసరిగా, కచ్చితంగా గెలిపించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు… అశోక్ గజపతిరాజు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, ఐ.వీ.పీ.రాజు..బొద్దుల నరసింగరావు… తదితరులు పాల్గొన్నారు.