32.2 C
Hyderabad
May 2, 2024 00: 03 AM
Slider కర్నూలు

నియోజకవర్గ ఇంచార్జ్ లతో టిడిపి అధినేత చంద్రబాబు రివ్యూలు

#chandrababu

తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ప్రాణ్యం, బనగానపల్లి, ఏలూరు నియోజకవర్గాల ఇంచార్జ్ లతో రివ్యూలు జరిగాయి. ఈ రివ్యూలకు గౌరు చరితారెడ్డి, బిసి జనార్థన్ రెడ్డి, బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు.

ఇప్పటి వరకు 46 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీలు ముగిశాయి. పార్టీ ఇంచార్జ్ పనితీరుపై భేటీలలో ప్రధాన చర్చ జరుగుతుంది. పార్టీ ఇంచార్జ్ పనితీరుపై తమ వద్ద ఉన్న సమాచారం, నివేదికల అధారంగా పార్టీ అధినేత చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్థానికంగా ఇంచార్జ్ చేస్తున్న పోరాటంతో పాటు…పార్టీ కార్యక్రమాల నిర్వహణ పరంగా ఉన్న ఫీడ్ బ్యాక్ పై ఇంచార్జ్ తో చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. మూడు నెలల తరువాత పనితీరును విశ్లేషించి, పార్టీ నేతల పనితీరు ఆధారంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా నేతలకు స్పష్టం చేస్తున్నారు.

Related posts

డోల్ డ్రమ్స్: సిఏఏ దెబ్బకు పెట్టుబడులు హాంఫట్

Satyam NEWS

అన్ని వర్గాల ప్రజల అభివృద్ది కోసమే బంగారు తెలంగాణ

Satyam NEWS

కర్రలతో పాటు 500 ట్రాక్ కెమెరాలు

Bhavani

Leave a Comment