సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళి లను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పించారు. ఈ మేరకు సీఎం కార్యాలయంలోని అధికారులకు తాజాగా శాఖల కేటాయింపులు చేశారు.
ఆ ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయింపు చేశారు.
ఇక నుంచి ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో.. జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్ ఉంటాయి. సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో.. రవాణ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ ఉంటాయి.
ధనుంజయ్ రెడ్డి పరిధిలో.. జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ ఉంటాయి.